17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

నాచారం వార్డులో సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని వినతి

31-12-2025 06:20 PM

ఉప్పల్,(విజయక్రాంతి): నాచారం వార్డు కార్యాలయంలో నూతనంగా ఏర్పాటైన సర్కిల్ కార్యాలయాన్ని  ఏర్పాటు చేయాలని ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తాకు BRS పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, పూర్వ నాచారం డివిజన్ బీఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయిజెన్ శేఖర్ మాట్లాడుతూ... నాచారం ఓల్డ్ విలేజ్లో రూ.కోటి యాభై లక్షల వ్యయంతో నిర్మించిన వార్డు కార్యాలయాన్ని సర్కిల్ కార్యాలయానికి ఉపయోగించుకోవాలని ఉప్పల్ కమిషనర్ రాధిక గుప్తకు విన్నవించుకున్నట్టు తెలిపారు. హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువులో గుర్రపు డెక్క విపరీతంగా పెరిగిందని దీనికి సంబంధించిన కాంట్రాక్టర్కుచే ఇంజనీరింగ్ అధికారులు పనులు చేయించాల్సింది పోయి  బిల్లులు చెల్లిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు శేఖర్ పేర్కొన్నారు. దీనికను కమిషనర్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.