అడ్లూరు ఎల్లారెడ్డిలో ఆర్ఎంపి వైద్యులకు సన్మానం
01-07-2025 08:13 PM
సదాశివనగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) సదాశివనగర్ మండలం ఆడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో మంగళవారం గ్రామంలోని ఆర్ఎంపి వైద్యులను మానవాక్కుల సహాయక సంఘం ఆధ్వర్యంలో ఆర్ఎంపీ వైద్యులు నరసింహ చారి, ఆకుల ఆంజనేయులు, వడ్ల ఆంజనేయులు, తిరుపతి రమేష్, రాజు, కుమ్మరి శంకర్ లను ఘనంగా సన్మానించారు. డాక్టర్స్ డే సందర్భంగా మానవ హక్కుల సంఘం నేతలు డాక్టర్ సలీం, ఇక శ్రీనివాసరావు, మోసార్ల అబ్బు రెడ్డి, సలావుద్దీన్, కుమ్మరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






