17 June, 2026 | 11:20 AM

Breaking News

మంత్రులు అడ్లూరి, వివేక్ కు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •  

నిబంధనలు పాటిద్దాం..

24-01-2026 12:32 AM

సురక్షితంగా ఇంటికి చేరుకుందాం..

తాండూరు, జనవరి23 (విజయక్రాంతి): ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం..క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకుందాం.. రోడ్డును గౌరవిద్దాం..క్షేమంగా గమ్యం చేరుకుందాం.. అంటూ వికారాబాద్ జిల్లా తాండూరులో శుక్రవారం పోలీసులు (అలైవ్, అరైవ్) రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డి, జిల్లా ఎస్పీ స్నేహ మెహర పాల్గొని మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు కేవలం ఒక వ్యక్తి ప్రాణాన్ని తీయడమే కాకుండా, ఆ కుటుంబం మొత్తాన్ని రోడ్డున పడేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా కుటుంబ పెద్దను కోల్పోయిన ఇళ్లు ఆర్థికంగా, సామాజికంగా చితికిపోతాయని... జిల్లా పోలీస్ శాఖ తరపున 2026 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలను కనిష్ట స్థాయికి తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్య సాధనలో ప్రజల సహకారం ఎంతో అవసరమని  అన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటించడం అనేది భయం వల్ల కాకుండా, బాధ్యతగా భావించాలని వారు కోరారు. అంతకుముందు ఇందిరా చౌక్  నుండి సమావేశ వేదిక వరకు  వివిధ కళాశాలల విద్యార్థులు, యువకులు, సామాజికవేత్తలతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిఎస్పి నర్సింగ్ యాదయ్య మరియు పోలీస్  సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.