17 June, 2026 | 8:41 PM

Breaking News

20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •   సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలి   •  

రహదారులకు మరమ్మతులు చేపట్టాలి

27-10-2025 12:52 AM

ములకలపల్లి, అక్టోబర్ 26, (విజయక్రాంతి); బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారా వు, అశ్వారావుపేట ఇంచార్జ్ మెచ్చ నాగేశ్వరావు ఆదేశాలతో గుంతలతో సెల్ఫీ డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆ పార్టీ నాయకులు వర్షాలకు దెబ్బ తిన్న రోడ్లను పరిశీలించారు.

ములకలపల్లి నుంచి దమ్మపేట ప్రధాన రహదారి, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి మండలాలకు అను సంధానంగా ఉన్న ప్రధాన రహదారుల్లో ఏర్పడ్డ గుంతలను  మండల నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోరంపూడి అ ప్పారావు గారు మాట్లాడుతూ ప్రధాన రహదారుల్లో ఏర్పడ్డ గుంతలు ప్రమాదాలకు నిలయంగా మారాయన్నారు.

గుంతలు ఏర్పడ్డ రోడ్లకు మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల వాహనదారులు నిత్యం ఎన్నో అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభు త్వం వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.