13 July, 2026 | 5:29 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు..

11-10-2025 07:52 PM

భారీగా హాజరైన స్వయం సేవకులు..

కన్నుల పండుగగా పద సంచలనం..

తాండూరు (విజయక్రాంతి): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వందలాది స్వయం సేవకులు గణవేష్(యూనిఫామ్) ధరించి పద సంచలనం(ర్యాలీ) చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధులు, పురవీధుల గుండా పత సంచలనం సాగింది. ప్రత్యేక వాహనంలో భరతమాత, సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ బలిరాం హెడ్గేవర్, గురూజీ చిత్రపటాలు ఏర్పాటు చేసి ఊరేగింపు నిర్వహించారు. దారి పొడవునా పుర ప్రముఖులు, యువకులు, మహిళలు, హిందూ సంఘాల నాయకులు పోటీపడి పూల వర్షం కురిపిస్తూ భారత్ మాతాకీ జై అంటూ చేసిన నినాదాలు పట్టణంలో మారుమ్రుగాయి. ఇంకా ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.