11-10-2025 07:53:36 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ మున్సిపాలిటీ బిజెపి ప్రధాన కార్యదర్శి, 3వ వార్డ్ బిజెపి నాయకులు కందునూరీ కుమార్ ఆధ్వర్యంలో శివాలయం దేవాలయములోని శివుని గర్భగుడికి ఎసిని వితరణ చేసిన అయిల్గ సరిత-రాజశేఖర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో శనివారం బిజెపి నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమములో సుల్తానాబాద్ మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు కూకట్ల నాగరాజు, ఓబీసీ పట్టణ అధ్యక్షులు శ్రీగిరి సుధాకర్ పాల్గొని ఆదంపతులకు శివుని ఆశిష్యులు ఉండాలని కోరుకోవడం జరిగింది.