24-09-2025 04:59:42 PM
ఖానాపూర్ ఎంపీడీవో సిహెచ్ రత్నాకర్ రావు
ఖానాపూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్యం పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఖానాపూర్ ఎంపీడీవో సిహెచ్ రత్నాకర్ రావు అన్నారు. బుధవారం ఆయన మండలంలోని బాదన కుర్తి గ్రామంలో పారిశుద్ధ్య పనులను, జిపి రికార్డ్స్ ను పరిశీలించారు. సిబ్బంది గ్రామాల్లో పనితీరును మెరుగుపరుచుకోవాలని ఆయన హెచ్చరించారు.