15 April, 2026 | 12:04 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

ఆకట్టుకున్న మోక్ష ధృతి నృత్య కళా ప్రదర్శన

10-01-2026 06:53 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): రవీంద్ర భారతిలో గ్లోబల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో మోక్ష దృతి నిర్వహించిన కూచిపూడి నాట్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఘట్ కేసర్ సర్కిల్ ఎన్ఎఫ్సీ నగర్ కు చెందిన కూచిపూడి నాట్య కళాకారిణి మోక్ష దృతి అద్భుతమైన అభినయంతో నాట్య ప్రదర్శన చేసి ప్రేక్షకుల మన్ననలు పొందడంతో పాటు అభినందనలు అందుకున్నారు.

గ్లోబల్ ఈవెంట్స్ అధ్యక్షుడు కే.వి రమణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొల్లేటి దామోదర్ గుప్తా, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచిన కళాకారులకు జ్ఞాపికలు, ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాట్య గురువులు ఝాన్సీరామ్, సునీత, అంజన, కవిత భారతి, నిర్మల, మైథిలి తదితరులు పాల్గొని కళాకారులను ప్రోత్సహించారు. సంప్రదాయ కళలకు వేదికగా నిలిచిన ఈ సంక్రాంతి సంబరాలు కార్యక్రమం సాంస్కృతికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.