07-09-2025 07:37:25 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం ఐటిడిఏ కార్యాలయం(Bhadrachalam ITDA Office)లోని ఇంజనీరింగ్ విభాగములో ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ గా సిహెచ్ సత్యానందం బాధ్యతలు స్వీకరించారు. గత మే నెలలో ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ గా చంద్రశేఖర్ ఉద్యోగ విరమణ చేసినందున పూర్తి అదనపు బాధ్యతలు ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ గా డి ఈ హరీష్ విధులు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నల్గొండ ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో డీఈ గా పనిచేస్తున్న ఆయనను పదోన్నతిపై భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగంనకు బదిలీ చేసినందున డీఈ హరీష్ నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు.