28 June, 2026 | 2:58 PM

Breaking News

ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •  

చెంచుల కోసమే సౌర గిరి జల వికాసం

12-05-2025 02:23 AM

మాచారం గ్రామంలో ముమ్మర ఏర్పాట్లు

నాగర్ కర్నూల్ మే 11 (విజయక్రాంతి) నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మాచారం గ్రామంలో ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని మే 18న ప్రారంభించేందుకు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

గిరిజన రైతుల సాగు భూములకు నీటి సదుపాయం కల్పించేందుకు బోరుబావులు తవ్వించి, సౌర విద్యుత్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి, ఇతర అధికారులతో కలిసి ఆదివారం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. రైతులకు పండ్ల తోటలు అందజేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.