12 July, 2026 | 4:11 PM

Breaking News

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •  

పిడుగుపాటుకు ఏడు మేకలు మృతి

24-09-2025 12:42 AM

నంగునూరు, సెప్టెంబర్ 23: నంగునూరు మండలం,సంతోష్నగర్ (గట్లమ ల్యాల) గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పిడుగుపడటం తో ఓ రైతు కుటుంబానికి తీవ్ర నష్టం వా టిల్లింది. ఎంతో కష్టపడి పెంచుకున్న ఏ డు మేకలు పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతి చెందాయి.గ్రామానికి చెందిన రైతు ఎర్గదిండ్ల సాయిలు కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.సాయిలు తన మేకలను మేత కోసం పొలంలోకి తోలుకెళ్లగా,ఆకస్మికంగా భారీ వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఏర్పడింది.

ఈ క్రమంలో, పిడుగు పడటంతో ఏడు మేకలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనతో తన జీవనోపాధిని కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోం ది.పిడుగుపాటుకు మృతి చెందిన మేకల వద్ద కూర్చుని ఆ కుటుంబ సభ్యులు రోదిస్తున్న దృశ్యం అక్కడి వారిని కలచివేసింది.ఈ కష్ట సమయంలో ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప తాము ఈ నష్టం నుంచి కోలుకోలేమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.