14 July, 2026 | 7:16 PM

Breaking News

విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •  

టీజీవో ప్రధానకార్యదర్శిగా బీ శ్యామ్

21-12-2025 12:00 AM

హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బీ శ్యామ్ ఎన్నికయ్యారు. నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన  కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు టీ జీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31న ప్రస్తుత టీజీవో రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఏ సత్యనారాయణ పదవీ విరమ ణ పొందుతున్న నేపథ్యంలో ఆ పదవిలో టీజీవో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బీ శ్యామ్‌ను ఎన్నుకున్నట్టు వెల్లడించారు. శ్యామ్ మా ట్లాడుతూ.. సం ఘం అభివృద్ధికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.