14 July, 2026 | 3:30 PM

Breaking News

అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •  

దుర్గామాత మండపంలో ఎస్సై సర్తాజ్ పాషా అన్నదానం

28-09-2025 11:15 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని  కూకుడ గ్రామంలోని దుర్గామాత మండపం వద్ద ఎస్‌ఐ సర్తాజ్ పాషా ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రజలందరూ కలిసిమెలిసి ఐక్యమత్యంతో పండగలు నిర్వహించుకోవాలని కులమత బేధాలు చూపెట్టకూడదని తెలిపారు. అందరూ కలిసి ఉంటేనే గ్రామం అన్ని విధాల అభివృద్ధి అవుతుందని అన్నారు. ప్రజలందరూ ఏకమైతేనే గ్రామంలోని సమస్యలు సైతం పరిష్కారం అవుతాయని అన్నారు. ఎస్సై సర్తాజ్ పాషా అన్నదానం ఏర్పాటు చేయడం పట్ల గ్రామ ప్రజలు ఎస్సైని సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.