17 April, 2026 | 10:31 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

రేణుకాఎల్లమ్మకు పట్టువస్త్రాలు

13-05-2025 12:21 AM

- అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్

- వైభవంగా మొదలైన ఎల్లమ్మ మహాజాతర

హుస్నాబాద్, మే 12 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని చారిత్రక ఎల్లమ్మ ఆల యం వద్ద ఏటా కనిపించే జానపదుల సాం స్కృతిక వైభవం ఈసారి మరింత శోభను సంతరించుకుంది. వైశాఖ మాస శుద్ధ పౌర్ణ మి నుంచి నెలరోజులపాటు జరిగే ఎల్లమ్మ మహాజాతర అట్టహాసంగా మొదలైంది. ఉ త్సవ కమిటీ సభ్యులు సోమవారం వేకువజామునే లందగోలెం, బొడ్రాయికి మొక్కు కొని వేడుకలు మొదలు పెట్టారు.

గౌడ కులస్తుల నుంచి ఘటాన్ని తీసుకొచ్చారు. సంప్ర దాయం ప్రకారం అమ్మవారికి బాసికాలు కట్టడంతోపాటు  అర్చకులు బోనాలు సమర్పించారు. కిన్నెర పంబాలవారు పట్నాలు వేసి, కథ చెప్పారు. రవాణా, బీసీ సంక్షేమ శా ఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అ మ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రేణుకా ఎల్లమ్మ, జమదగ్ని మహాముని కల్యాణ మహోత్సవంలో  అమ్మవారికి బాసికాలు కట్టే వేడుకకు ప్రజలు వేలాదిగా వచ్చి మొక్కలు చెల్లించుకున్నారు. భక్తుల కోలాహలం, ఆధ్యాత్మిక చింతనతో పట్టణమంతా నిండిపోయింది. 

ఎల్లమ్మతల్లి కొంగుబంగారం : మంత్రి

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ‘హుస్నాబాద్ ప్రజలకు ఎల్లమ్మ తల్లి కొంగుబంగారం. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ ప్రాంత ప్రజలపై ఉంటాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు  చే సింది‘ అని అన్నారు. కాకతీయుల కాలం నుండి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వరకు ఎల్లమ్మ తల్లి చరిత్రను ఆయన గుర్తు చేశారు. ‘హుస్నాబాద్ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాల తో ఉండాలని ఎల్లమ్మ తల్లిని మొక్కుకున్నాను. అని అన్నారు.