9 April, 2026 | 8:32 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ఇషావా జోడీకి రజతం

12-11-2025 12:00 AM

వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్

కైరో, నవంబర్ 11: ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ షూట ర్లు సత్తా చాటుతున్నారు. వ్యక్తిగత విభాగాల్లో అదరగొట్టిన మన షూటర్లు తాజాగా టీమ్ ఈవెంట్స్‌లోనూ పతకాలు గెలిచారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్సిడ్ టీమ్ ఈవెంట్‌లో ఇషా సింగ్, సామ్రాట్ రాణా జోడీ రజత పతకం సాధించింది .సోమవారం వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన సామ్రాట్, ఇషాతో కలిసి మిక్సిడ్ టీమ్ ఈవెంట్‌లో చివరి వరకూ పోరాడినా రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

మరో షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. మెడల్ రౌండ్‌లో ఐశ్వరీ ప్రతా ప్ సింగ్ 466.9 పాయింట్లతో రెండో స్థానం లో నిలిచాడు. అగ్రస్థానంలో నిలిచిన చైనా షూటర్‌కు , అతనికి మధ్య 0.2 మాత్రమే తేడా ఉంది. ఓవరాల్‌గా పాయింట్ల పట్టికలో భారత్ 11 పతకాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. భారత షూటర్లు ఇప్పటి వర కూ 3 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు గెలిచారు. 15 పతకాలతో చైనా అగ్రస్థానం లో ఉండగా.. కొరియా 7 పతకాలతో మూడో ప్లేస్‌లో కొనసాగుతోంది.