11 July, 2026 | 9:37 PM

Breaking News

ఆకట్టుకున్న ఐవీవై, సిద్ధార్థ రోబోటిక్స్ ఎక్స్ పో   •   సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుని ఎన్నిక   •   సుల్తానాబాద్ శ్రీ శివాలయంకు లలిత అమ్మవారి విగ్రహం అందజేత   •   జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం   •   ఆవుపై చిరుత దాడి   •   'పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ లక్ష్యం'   •   కోనరావుపేటలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు   •   బేగంపేటలో దొంగల హల్‌చల్.. 20 పంపుసెట్ల విద్యుత్ కేబుళ్ల చోరీ   •   ఉద్యమానికి సిద్ధం.. 17న మందకృష్ణ మాదిగ రాక   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నేత చల్మెడ   •  

ఓట్ల చోరీకి ‘సర్’ కొత్త ఆయుధం

19-08-2025 12:32 AM
  1. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
  2. ఓట్ల చోరీని అడ్డుకుంటామని హామీ
  3. బీహార్‌లో రెండో రోజు కొనసాగిన ‘ఓట్ అధికార్’ యాత్ర

పాట్నా, ఆగస్టు 18: పత్యేక సమగ్ర సవరణ (సర్) ఓట్లను చోరీ చేసేందుకు  కొత్త ఆయుధమని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్ల చోరీని అడ్డుకుని తీరుతామని వాట్సాప్ చానల్‌లో హామీనిచ్చారు. కాం గ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ‘ఓట్ అధికార్’ యాత్ర సోమవారం ఔరంగాబాద్ నుంచి పునఃప్రారంభం అయింది. ఔరంగాబాద్‌లోని ప్రముఖ సూర్య దేవాలయంలో పూజల అనంతరం రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ యాత్రను కొనసాగించారు.

మార్గ మధ్యలో వారితో వికాస్‌శీల్ ఇన్‌సాన్ పార్టీ (వీఐపీ) పార్టీ అధినేత ముఖేష్ సహాని, బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ రాం జాయిన్ అయ్యారు. తేజస్వీ యాదవ్ సామాజిక మాధ్యమంలో యా త్రకు సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా సోషల్ మీడియా వేదికగా యాత్రను తన మద్దతు తెలిపారు. యాత్రకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు.