30 June, 2026 | 7:54 PM

Breaking News

మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు పలు దుకాణాల్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు   •   పౌర హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు   •   ఆర్టీసీ కార్గో సేవలు పునరుద్ధరించాలి   •   సిద్దాపూర్ రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   సుల్తానాబాద్ మున్సిపల్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యం   •   చిన్న గాలి వానోస్తే కరెంటు గల్లంతే   •   మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   రామేశ్వరపల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం   •   ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి యువకుడు మృతి   •   మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •  

పాణి పూరి తిని ఆరుగురు అస్వస్థత

01-05-2025 10:07 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ లో పాణిపూరి తిని ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. బాధిత కుటుంబీకులు వివరాలు తెలిపిన ప్రకారం.. కాల్ టెక్స్ లో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో మేరుగు సంగీతా దేవి(32), మేరుగు అనుప్రియ(6), కాదాసి త్రిషిక(21) చిలివేరి అక్షయని(9), చిలివేరి వాషిత(7), పుల్లె శ్రీకాంత్(28) లు అక్కడికి వెళ్ళి పాణిపూరి తిన్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఒంటి గంట సమయంలో వీరంరూ వాంతులు, విరోచనాలు చేసుకున్నారు.

కడుపు నొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధితులను బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పరీక్షించిన పిల్లల వైద్యలు  పరీక్షించి తగు చికిత్స అందించారు. బాధితులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్సలు అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపర్ అన్నింటి డాక్టర్ జి డి రవికుమార్ తెలిపారు.