15-11-2025 09:40:23 PM
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని ఖాజాపూర్ గ్రామంలో శనివారం నాడు సొసైటీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా సొసైటీ ఛైర్మెన్ చిన్నపట్ల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ... రైతులకు పండించిన వరి పంటకు ప్రభుత్వానికి అమ్ముకోవడానికి కడ్పల్ సొసైటీ, ఐకేపీ సెంటర్ కు తీసుకెళ్లాలనంటే కడ్పల్ వెళ్లాల్సి వస్తుందని, రైతులకు దృష్టిలో ఉంచుకొని రైతులకు ఇబ్బంది కలుగకుండా సొసైటీ ఛైర్మెన్ వరి సబ్ సెంటర్ ను ప్రారంభించారు.