17 April, 2026 | 10:28 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

గ్రామాలలో తాగునీటికి కష్టాలు తీర్చండి

08-05-2025 12:16 AM

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో అనర్హులకు చోటు ఇవ్వొద్దు 

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ మే 7 (విజయక్రాంతి): ఎండలు రోజురో జుకు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామాలలో తాగునీటి సమస్య రాకుండా సంబంధిత అధికారు లు చురుగ్గా పనిచేయాలని నాగ ర్కర్నూల్ జిల్లా కలెక్టర్ ప్రదాత సంతోష్ అన్నారు. బుధవారం కల్వకుర్తి మండలం రఘుపతి పేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో అనర్హులకు చోటువద్దని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి ఉచితంగా ఇసుక పంపిణీతో పాటు తక్కువ ధరకు సిమెంటు, తక్కువ ధరకే మేస్త్రి కూలి కూడా అందేలా సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలన్నారు.

నిత్యం ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామాలలో తాగునీటి సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. అనంతరం ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం చారగొండ మండల కేంద్రం జూపల్లి గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.