27 June, 2026 | 2:20 PM

Breaking News

రెండు చుక్కలే..చిన్నారుల భవిష్యత్‌ కు రక్షణ!   •   మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం అక్రమాలపై 11 మందిపై కేసు నమోదు   •   ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర గ్రూప్-1 ప్రథమ ర్యాంకర్   •   ప్రమాదానికి మద్యం మత్తే కారణం   •   షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో "ఎమ్మెల్యే" ఆకస్మిక తనిఖీ   •   సత్తుపల్లి మున్సిపాలిటీ 19వ వార్డు – తుమ్మూరి రామారావు వీధిలో ప్రజల దుస్థితి.   •   ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. రైతన్నల కళ్లలో ఆనందం   •   జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీల వీరంగం   •   ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటే: కమటం వెంకటేశ్వరరావు   •   నిండు వర్షంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి   •  

సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ

03-11-2025 07:11 PM

గజ్వేల్ విద్యుత్ శాఖ డిఈ భాను ప్రకాష్...

గజ్వేల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు గజ్వేల్ విద్యుత్ శాఖ డిఈ భాను ప్రకాష్ అన్నారు. గజ్వేల్ డివిజన్ కార్యాలయంతో పాటు, గజ్వేల్, ములుగు, తుక్కాపూర్ సబ్ డివిజన్ కార్యాలయాలలో విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యుత్ సమస్యలపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ డివిజన్ పరిధిలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమస్యలను పరిష్కరించి నాణ్యమైన విద్యుత్ ను వినియోగదారులకు అందించడమే  తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో  గజ్వేల్, ములుగు,తుక్కాపూర్  ఏడీఈలు జగదీశ్ ఆర్య,  శ్రీనివాస్, ఎన్. శ్రీనివాస్, డివిజన్ పరిధిలోని ఆయా మండలాల ఏఈలు, విద్యుత్ శాఖ సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.