16 April, 2026 | 10:29 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఏడుపాయలలో స్పెషల్ పోలీసుల దాడి

27-11-2025 12:26 AM
  1. పేకాట ఆడుతున్నారని సమాచారం 

దోపిడీ దొంగలని వివిధ వెబ్ సైట్లలో ప్రచారం 

పాపన్నపేట, నవంబర్ 26 :పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మే రకు మెదక్ స్పెషల్ పోలీసు లు దాడి చేసిన సంఘటన మం గళవారం రాత్రి ఏడుపాయల్లోని హీరాలాల్ షెడ్డులో చోటు చేసుకుంది.

రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయ సత్రమైన హీరాలాల్ షెడ్డులో పే కాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక పోలీసులు దాడి చేయగా పేకాట రాయుళ్ళు పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులపై దాడి చేసేందుకు ఉపక్రమించేందుకు ప్రయత్నం చేయడంతో అనుకొని సంఘటనను గుర్తించిన పోలీసు ఉన్నత అధికారి తన వెంట  ఉన్న రివాల్వర్ చూపించడంతో భయపడిన పేకాట రాయుళ్ళు వెనుకంజ వేశారు.

దీంతో కుటుంబీకులు తాము విందులో పాల్గొనేందుకు వచ్చామని, తమ కుటుంబ సభ్యులను వదిలి పెట్టాలని వేడుకోవడంతో పోలీసులు మానవతా దృక్పథంతో వదిలి పెట్టినట్లు ఉన్నత అధికారి పేర్కొన్నారు. ఈ విషయమై రివాల్వర్ తో దోపిడీ దొంగలు అని బుదవారం వివిధ వెబ్ సైట్ లలో ప్రచారం కావడం విస్మయానికి గురిచేసిందని, దాడి చేసింది దొంగలు కాదు పోలీసులని వెల్లడించారు.