7 July, 2026 | 7:32 PM

Breaking News

డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •  

వేంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

19-05-2025 12:00 AM

సిద్దిపేట, మే 18 (విజయక్రాంతి): సిద్ధిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం స్వర్ణోత్సవాల్లో భాగంగా ఆదివారం వైనతేయ ఇష్టి ( కాలసర్ప దోష నివారణ , సత్ సంతాంభివృద్ధి ) హోమాన్ని వేద పండితులు నిర్వహించారు. అనంతరం ధ్వజా రోహణం జరిగింది. అంతకు ముందు విష్వక్సేన ఆరాధన , పుణ్యావచనం, యాగశాల ప్రవేశం, శాంతి పాఠం, ఆరణి మథనం, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు.

సాయంత్రం భేరి పూజ, దేవతాహ్వానము జరిగింది. స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ్ చిన జీయర్ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమాలలో ఆలయ ఛైర్మన్ రమేష్ విష్ణు, కార్యనిర్వహణాధికారి విశ్వనాథశర్మ, డైరెక్టర్లు దాస శ్రీనివాస్, బుర్ర శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.