11-02-2025 12:00:00 AM
కోహీర్, ఫిబ్రవరి 10: సుప్రసిద్ధ పుణ్య క్షేత్రము బడం పేట శ్రీ రాచన్న స్వామి వారి ఆస్తుల వేలం పాటలు సోమవారం నిర్వ హించారు. రెండు దుకాణాల వేలం ద్వారా రూ. 7.80 లక్షలు ఆదాయ లభించింది. హోటల్ కం టిఫిన్ సెంటర్ ద్వారా రూ. 3 లక్షలు, వ్యవసాయ భూమి ద్వారా 1.65 లక్షల ఆదాయం లభించింది.
కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సుపరెం డెంట్ శివరాజ్, కార్యనిర్వాహణ అధికారి శివరుద్రప్ప, రెన్యువేషన్ కమిటీ సభ్యులు దయానంద్ పాటిల్, శ్రీపాల్, నాగేశ్, మున్నూరు రాజు, మాజీ చైర్మన్ రాచయ్య, పెద్దలు ప్రతాప్ రెడ్డి, శివమూర్తి స్వామి, రాజన్న, శివానంద స్వామి, జగదీశ్వర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.