15 April, 2026 | 4:58 AM

నాచారం పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు సైకిల్ ర్యాలీ

25-10-2025 07:39 PM

ఉప్పల్,(విజయక్రాంతి): పోలీస్ సంస్కరణ దినోత్సవం పునరస్కరించుకొని నేపథ్యంలో నాచారం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్ ఆధ్వర్యంలో నాచారంలోని  అకాడమిక్ హైట్, కమల్ మెమోరియల్ స్కూల్  విద్యార్థులు సైకిల్  ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్  విద్యార్థులకు పోలీస్ అమరవీరులు చేసిన త్యాగాలు పోలీస్ వ్యవస్థ ప్రజలతో ఎలా పనిచేస్తుందో  విషయాలను  తెలిపారు. నాచారం పోలీస్ స్టేషన్ లోని ఫిర్యాదుల కేంద్రం మరియు మాస్టర్ ఆఫ్ పోలీస్ పోర్టల్  డేటా బేస్ నేరస్తుని అనుమానితుల శోధించే సీసీటీన్స్ గురించి నేరాలు చేసే వారిని వేసే లాక్ అప్ ను  విద్యార్థులకు చూపిస్తూ  అవగాహన కల్పించారు.  మార్కద్రవ్యాలు పట్ల విద్యార్థులు దూరంగా ఉండాలని విద్యార్థులకు అయినా సూచించారు.