calender_icon.png 16 August, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోమూర్ - అంతాపూర్ రోడ్డు పరిశీలించిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

16-08-2025 05:23:21 PM

యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఆదేశం

మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం అంతాపూర్- సోమూర్ రోడ్డును సబ్ కలెక్టర్ కిరణ్మయి శనివారం పరిశీలించారు. అదేవిధంగా దిగువ భాగాన ఉన్న సోమూర్, చిన్న ఎక్లారా గ్రామాల మధ్యలో ఉన్న లెవెల్ వంతెనలపై నుండి వరద పారడంతో రోడ్లు పాడయి పోయాయి. ఈ ప్రాంతాలను సందర్శించిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ... పాడైపోయిన రోడ్లకు వెంటనే తాత్కాలికమరమ్మత్తులు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

మద్నూర్ జుక్కల్ రహదారిలో అంతపూర్ తడ్గుర్ వద్ద వాగు వరద దాటికి పాడైపోయిన రోడ్డును  వరద తగ్గి, రోడ్డు రిపేర్ అయ్యేంత వరకు రోడ్డును మూసి వేస్తున్నట్లు తెలిపారు. ఇంక ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇంటి నుండి బయటకు రావొద్దు అన్నారు. జుక్కల్, మద్నూర్ మండలాల మధ్య గ్రామాల మధ్యలో వర్షాలకు వాగులు పొంగి పొర్లు తున్నాయి కాబట్టి ప్రజలు వర్షాలు తగ్గే వరకు మరి ముఖ్యంగా రాత్రి సమయాలలో ప్రజలు ఎవరు ప్రయాణాలు చేయరాదు అన్నారు. సబ్ కలెక్టర్ వెంట మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్, ఎంపీడీఓ రాణి, మండల ఎస్సై  విజయ్ కొండ ఆర్ & బి ఏఈ తదితరులు పాల్గొన్నారు.