15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య

28-05-2025 06:01 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని గురునాథ్ పల్లి గ్రామానికి చెందిన పంతుల రఘుపతి అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. స్థానిక ఎస్ఐ యుగేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... గురునాథ్ పల్లి గ్రామానికి చెందిన పంతుల రఘుపతి వ్యవసాయం చేస్తుండగా పంట దిగుబడి రాకపోవడంతో అప్పులు పెరగడంతో ఈ నెల 24న గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడం జరిగిందని తెలిపారు. అతనిని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి అనంతరం మెరుగైన చికిత్స కోసం ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రికి తరలించారని చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగిందని అతని భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.