11 May, 2026 | 2:07 PM

Breaking News

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   ప్రారంభమైన నివాసాలకు గుర్తింపు   •   వెంచర్లో అక్రమాలపై కుల సంఘాల పిర్యాదు   •   యూనియన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించం!   •   మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •  

గుంజపడుగులో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం

09-09-2025 08:16 PM

మంథని (విజయక్రాంతి): తెలంగాణ ప్రజా కవి శ్రీ కాళోజి నారాయణ రావు జయంతి పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవం కార్యక్రమాన్ని జడ్పీ హెచ్ ఎస్ గుంజపడుగు పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాళోజి తన తెలంగాణ వాడుక భాషలో కవితల ద్వారా ప్రజల్లో తెచ్చిన చైతన్యాన్ని తెలంగాణ ఉద్యమంలో వీరి కవితల స్ఫూర్తిని విద్యార్థులకు వివరించారు. కాళోజి చిత్ర పటానికి మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, దాసరి లక్ష్మి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు శివలీల, కర్రు సురేష్, సంగీత, స్వామి, రవీందర్, భూమయ్య, నరేందర్, విజయలక్ష్మి, సతీష్ రెడ్డి లు పాల్గొన్నారు.