15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలి

30-12-2025 01:57 AM

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం

హుజురాబాద్, డిసెంబర్ 29 (విజయ క్రాంతి)క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి విజేతలగా నిలిచి పేరు ప్రఖ్యాతులు గడించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం ,కేశవపట్నం ఎస్‌ఐ కట్కూరి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహించి ప్రతిభ కనబరిచిన వాలీబాల్ విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం చేశారు.

ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సిపి గౌస్ అలం, హుజరాబాద్ డివిజన్ ఎసిపి వి మాధవి క్రీడాకారులతో వాలీబాల్ ఆడారు. అనంతరం ఏర్పాటుచేసిన బహుమతి ప్రధానోత్సవం లో సిపి గౌస్ అలం మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో, క్రమశిక్షణ కలిగి, ముందుకు సాగి, విద్యతోపాటు క్రీడల్లో ప్రతిభ కనబరిచి కన్న తల్లిదండ్రులకు, పుట్టిన గ్రామానికి, పాఠశాలకు, కళాశాలలకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు.

తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో సోదర భావం పెంపొందించేందుకు ఫ్రెండ్లీ క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని క్రీడా పోటీలలో గెలుపు ఓటమి సహజమేనని గెలిచినవారు, ఓడినవారు సోదర భావంతో ముందుకు సాగి క్రీడల్లో మెలకువలు అవలంబించుకొని పోటీలలో ప్రతిభ కనబరిచేందుకు ముందుకు సాగాలని క్రీడాకారులకు సిపి గౌస్ ఆలం సూచించారు.

కేశవపట్నం ఎస్త్స్ర కట్కూరి శేఖర్ రెడ్డి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో క్రీడాకారులకు, విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని ఎస్‌ఐ శేఖర్ రెడ్డిని అభినందించారు. ఫ్రెండ్లీ వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరిచిన జట్లకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ రూరల్ సిఐ పులి వెంకట్, ఏఎస్‌ఐ బి సంపత్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ కే శ్రీనివాస్, పోలీసులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తో పాటు తదితరులు పాల్గొన్నారు.