14 April, 2026 | 5:14 PM

Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •  

దేశంలోనే భారీ భూ కుంభకోణం ‘హిల్ట్’

27-11-2025 12:00 AM

-9,292 ఎకరాలతో  6.29 లక్షల కోట్ల లూఠీకి కాంగ్రెస్ ప్రభుత్వం స్కెచ్

-బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి తెలంగాణ రాష్ర్ట ప్రభు త్వం తెరలేపిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడి యా సమావేశంలో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌తో హిల్ట్‌పై ఆయన వివరించారు. జూబ్లీహి ల్స్ ప్యాలెస్‌లో సీఎం రేవంత్ రెడ్డి తన అనుచరులతో ఈ  కుంభకోణానికి పథకం వేశారని మండిపడ్డారు. నవంబర్ 22న జీవో నెంబర్ 27 తీసుకొచ్చి 9,292 ఎకరాలకు సంబంధించి 22 ఎస్టేట్స్‌లను మల్టీ జోన్స్ కన్వర్ట్ చేయడానికి ప్లాన్ వేశార న్నారు.

కేవలం ఎస్‌ఆర్‌ఓ వాల్యూలో 30 శాతానికి దారదాత్తం చేసే కుట్ర చేస్తున్నారని తెలిపారు. దాదాపు ఈ ఆస్తి విలువ 6.29 లక్షల కోట్లకుపైనే ఉంటుందని, దీంతో రాష్ర్ట అప్పును సైతం తీర్చేయొచ్చునని పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్ వెలుపల గల వేల ఎకరాల భూములకు ప్రభుత్వం లూఠీ చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ముందుగానే సీఎం రేవంత్ రెడ్డి తమ అనుచరులను అక్కడి 22 ఎస్టేట్స్‌కి పంపించి అక్కడి కంపెనీలతో పథకం ప్రకారం ఒప్పందం చేసుకున్నారని అన్నారు. ఈ హిల్ట్ పాలసీని, ఆ జీవోను తక్షణమే రద్దు చేయాలని, లేకుంటే బీజేపీ కచ్చితంగా ఈ కుంభకోణంపై ఉద్యమం చేస్తుందని తెలిపారు.