24 May, 2026 | 2:29 PM

Breaking News

140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •   ఘనంగా మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా 2వ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026   •   మండలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్   •   విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు   •   పంట వ్యర్థాల దగ్ధంతో ఆందోళనలో పల్లె ప్రజలు   •   శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు   •   కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు   •   నీలోఫర్ కేఫ్ పరిధిలో రెచ్చిపోయిన ఆకతాయిలు   •  

స్మశాన వాటికను వెంటనే నిర్మించాలి

31-07-2025 12:53 AM

మహబూబాబాద్, జూలై 30 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిజాం చెరువు వద్ద స్మశాన వాటికను వెంటనే నిర్మించాలని సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సిపిఐ కార్యదర్శి పెరుగు కుమార్, 27వ వార్డు కార్యదర్శి వెలుగు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో నిజం చెరువు వద్ద శ్మశాన వాటిక నిర్మాణం కోసం అప్పటి ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ 30 లక్షల రూపాయలు మంజూరు చేశామని, శంకుస్థాపన కూడా చేసి ప్రజలను మభ్య పెట్టారని ఆరోపించారు.

శ్మశాన వాటిక నిర్మాణం కోసం కేటాయించిన 10 గుంటల భూమి అన్యాక్రాంతం అవుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే నిజం చెరువు వద్ద కేటాయించిన స్థలంలో శ్మశాన వాటిక నిర్మించాలని డిమాండ్ చేశారు.  మున్సిపల్ అధికారులకు  వినతిపత్రం ఇచ్చారు.