31-01-2026 12:34:06 AM
తాడ్వాయి, జనవరి, 30( విజయ క్రాంతి): పేదలను ఆదుకోవడం కోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా సీఎం రిలీఫ్ పండు చెక్కులను అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి, బ్రహ్మాజీ వాడి బ్రాహ్మణపల్లి గ్రామాలలో శుక్రవారం నాయకులు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు షౌకత్ అలీ, నరసారెడ్డి, రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.