01-05-2025 05:22:02 PM
రిటైర్డ్ కర్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి..
జనగామ (విజయక్రాంతి): బీజేపీ పాలనతోనే దేశం సుభిక్షంగా ఉంటుందని రిటైర్డ్ కర్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి అన్నారు. గురువారం ఆయన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ చేతులమీదుగా జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ క్రియాశీలక సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని అణిచివేయడంలో మోడీ సర్కార్ కృత నిశ్చయంతో పనిచేస్తుందని కొనియాడారు. ఎక్కడా లేని విధంగా బహుజనులు, దళితులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న బీజేపీకే దక్కిందన్నారు. జై జవాన్, జై కిసాన్ నినాదంతో బీజేపీ పాలన సాగుతోందన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశంలో అభివృద్ధి, సంక్షేమం సముపాళ్లలో నడుస్తున్నాయని చెప్పారు.