27-09-2025 12:00:00 AM
మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
బిచ్కుంద, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం ఏడవ నిజాం నవాబు పాలనలో తెలంగాణ రైతులు ఎదుర్కొన్న దొరల దౌర్జన్యాన్ని, బహుజనులు ఎదుర్కొన్న వివక్షను, మహిళలు ఎదుర్కొన్న అన్యాయాలను ప్రతిఘటించిన చైతన్యజ్యోతి చాకలి ఐలమ్మ అన్ని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ... ఆమె పోరాటం కేవలం భూమి కోసం జరిపింది కాదు.
అందువల్ల ఐలమ్మ జయంతి తెలంగాణ ప్రజలకు సామాజిక సమానత్వం, రైతాంగ హక్కులు, స్త్రీ శక్తి అనే త్రివేణి సంగమంను గుర్తుచేసే ప్రేరణాత్మక దినోత్సవం.ఈ కార్యక్రమం లో బిచ్కుంద మండలం పార్టీ అధ్యక్షులు వెంకట్ రావు దేశాయ్, మాజీ మార్కెట్ చైర్మన్ నాల్చర్ రాజు, బిచ్కుంద పట్టణ పార్టీ అధ్యక్షులు అవార్ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ నాల్చర్ బాలు వైస్ చైర్మన్ యాదవ్ రావు, బస్వారాజ్ వున్నారు.