9 May, 2026 | 5:35 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

సినిమా విభజన చట్టాన్ని అమలు చేయాలి

21-08-2025 12:00 AM

- తెలంగాణ సినిమా వేదిక డిమాండ్ 

సినిమా ప్రతినిధి/ఖైరతాబాద్: తెలంగాణ, ఆంధ్ర సినిమా విభజన చట్టాన్ని అమలు చేయాలని, తెలంగాణ సినిమా పాలసీని తక్షణమే రూపొందించాలని వక్తలు డిమాండ్ చేశారు. బుధవారం  సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ సినిమా వేదిక (టీసీవీ) గౌరవాధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామ్‌రెడ్డి అధ్యక్షతన ‘సినిమా కార్మికుల సమ్మె.. తెలంగాణ, -ఆంధ్ర సినిమా విభజన‘ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్, ప్రొఫెసర్ నందిని సిధారెడ్డి, చల్ల శ్రీనివాస్, పీ కుల్జారెడ్డి, సినిమా ఆర్టిస్ట్ భూక్యా బాలు, నటుడు కార్తీక్‌రెడ్డి తదితర ప్రముఖులు మాట్లాడారు. సినిమా అభివృద్ధికి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చిన కే రాఘవేంద్ర స్టూడియో, పద్మాలయ స్టూడియో, ఆనంద్ సినీ సర్వీస్, రామా నాయుడు, ఎన్‌బీకే ఎస్టేట్, గోల్కొండ క్రాస్‌రోడ్డు ఎన్టీఆర్ స్టూడియోలను తక్ష ణమే రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు.

వంద ఎకరాల్లో ప్రొఫెసర్ జయశంకర్ ఫిలిం యాక్టింగ్ స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ భాష, యాస సంస్కృతిలో వచ్చే సినిమాలకు 50 శాతం సబ్సిడీని అందజే యాలని కోరారు.  తెలంగాణలో థియేటర్ల సిండికేట్ విధానాన్ని అరికట్టాలని కోరారు. ఆంధ్ర సినిమాలకు ఇచ్చిన గద్దర్ ఫిలిం అవార్డులను ప్రభుత్వం రద్దు చేసి, తెలంగాణ వారికి ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లారా, కార్యదర్శి మోహన్ బైరాగి, షావలి, ఐఎనన్టీటీవీ అంజలికుమారి, జోగిరాల, పీవోడబ్ల్యూ సునీత తదితరులు పాల్గొన్నారు.