28 June, 2026 | 12:13 PM

Breaking News

రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •   ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్తగూడెం   •   కారు, లారీ ఢీకొని యువకుడు మృతి   •   విద్యుదుఘతంతో వాటర్ పిల్టర్ టెక్నిషియాన్ మృతి   •  

కెనాల్‌లో బాలిక మృతదేహం

31-01-2026 12:27 AM

 ఆచూకీ నిర్ధారించిన పోలీసులు 

బోధన్,జనవరి 30 (విజయక్రాంతి) : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ఏ ఆర్ పి క్యాంప్ గ్రామ శివారులో గల ౄ46 కెనాల్లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యమయ్యింది.  జిల్లాలో ఈఘటన తీవ్ర సంచలనం సృష్టించిన సృష్టించింది. ఇటీవల ఈ సంఘటనకు సంబంధించిన సమాచారంతో కీలక మలుపు తిరిగింది. శుక్రవారం ఉదయం పోలీసులు బాలిక ఆచూకీని నిర్ధారించారు. మృత బాలిక మహారాష్ట్ర ముత్కేడ్ జిల్లా నివాసిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. 

బాలిక మృతి వెనుక గల కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన బాలిక మృతదేహం తెలంగాణలోని కెనాల్లో లభించడం పలు సందేహాలకు తావిస్తోంది. ప్రమాదవశులు జరిగిన సంఘటననా లేక బాలిక హత్య, హత్యకు గురై ఉంటుందా అనే కోణంలో పోలీసులు తమ దర్యాప్తుసాగిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నత పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. బాలిక ఇక్కడికి ఎలా చేరింది? ఎవరి ప్రమేయమైన ఉందా? అనే అంశాలపై సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరా లు వెల్ల డిస్తా మని పోలీసు లు తెలిపారు.