02-09-2025 12:00:00 AM
ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి
మునుగోడు,సెప్టెంబర్ 1 (విజయ క్రాంతి): పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ& సబ్బండ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తాసీల్దార్ నేలపట్ల నరేశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 66 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసి మాట్లాడారు.
పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. మహిళల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.గురుకుల పాఠశాలలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన సొంత నిధుల నుండి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటీ నారాయణ,మండల అధ్యక్షుడు బీమనపల్లి సైదులు, మాజీ ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేకల రామస్వామి,మాజీ సర్పంచ్లు జాలా వెంకటేశ్వర్లు, తాటికొండ సైదులు, పాలకూరి యాదయ్య,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డి, కుంభం చెన్నారెడ్డి, మిరియాల వెంకటేశ్వర్లు, వేమిరెడ్డి జితేందర్ రెడ్డి, కుంభం చెన్నారెడ్డి, మందుల బీరప్ప, ఆరేళ్ల సైదులు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల లబ్ధిదారులు ఉన్నారు.