01-09-2025 12:41:12 AM
నిర్మల్, ఆగస్టు 31 (విజయక్రాంతి): నిర్మ ల్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు అనేక రహదారులు ధ్వంసం అయ్యాయని వాటిని గండ్లు పూడ్చేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందని డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు.
ఆదివారం నిర్మల్ లక్ష్మణ దిల్వార్పూర్ మండలంలో దెబ్బతిన్న రోడ్లను పంటలను పరిశీలించి జరిగిన నష్టా న్ని అక్కడ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభు త్వం ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగర్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.