13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

మంచినీటి పైప్‌లైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ

26-01-2026 03:09 AM

కరీంనగర్, జనవరి 25 (విజయ క్రాంతి): నగరంలోని 45వ డివిజన్ మంకమ్మతోటలో 7 లక్షల రూపాయల సాధారణ నిధులతో 300 మీటర్ల మంచినీటి పైప్ లైన్ నిర్మాణానికి ఆదివారం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యతతో త్వరగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టరుకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేశ్, గుగ్గిళ్ళ జయశ్రీ - శ్రీనివాస్, మైనార్టీ నగర శాఖ అధ్యక్షులు సౌకత్ అలీ, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, సుడా మాజీ డైరెక్టర్ నేతి రవివర్మ, నాయకులు మెతుకు సత్యం, బిఆర్‌ఎస్ పార్టీ యువజన విభాగం ప్రతినిధులు వొడ్నాల రాజు, ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, శ్రీనివాస్, మిడిదొడ్డి నవీన్, నందెల్లి చిన్న, మహేష్, అంజలి, తదితరులు పాల్గొన్నారు