25 May, 2026 | 7:03 PM

Breaking News

ట్రాక్టర్ బోల్తా.. ఇంటర్ విద్యార్థి దుర్మరణం   •   ఆ పన్నులను ఆదుకుంటేనే... జీవితంలో సార్ధకత   •   నకిలీ పత్తి విత్తనాల గుట్టు రట్టు.. నలుగురు నిందితులు అరెస్టు   •   ఆ దేవుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: పిల్లుట్ల రఘు   •   ఏడుపాయల చెక్‌డ్యాంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యం   •   ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే   •   పాలకోయ్యతండా, మంచి కనగర్ చిన్నారులను విద్యకు దూరం చేయవద్దు   •   రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం విద్యార్థి ప్రతిభ   •   ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి.. సిఐటియు డిమాండ్   •   ఈత సరదా విషాదంగా మారొద్దు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •  

నాగోబా జాతరకు శ్రీకారం...

23-12-2025 02:18 AM

నెలవంక దర్శనంతో మెస్రం వంశీయుల పూజలు

ఉట్నూర్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా జాతర మహా ఘట్టానికి మెస్రం వంశీయులు శ్రీకారం చుట్టారు.  ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో కొలువైన నాగోబా జాతరకు సంబంధించి సోమవారం రాత్రి నెలవంక దర్శనంతో పూజలకు శ్రీకారం చుట్టారు. మెస్రం వంశస్థులు గ్రామంలోని మురారి ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించి నెలవం కను దర్శించుకున్నారు. ఈ పూజల్లో ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు, పూజారి హనుమంత రావు, మెస్రం వంశస్థులు పాల్గొన్నారు.