15 April, 2026 | 4:37 AM

అధికారులను కలిసిన నూతన సర్పంచులు

16-12-2025 02:02 AM

కొండాపూర్, డిసెంబర్ 15 : నూతనంగా గెలుపొందిన సైదాపూర్ సర్పంచ్ రాధికరామాగౌడ్, గుంతపల్లి సర్పంచ్ అనంత రెడ్డి లు తహశీల్దార్ ఆశోక్, ఎంపిడిఓ సౌమ్యశ్రీ, ఎస్త్స్ర సోమేశ్వరులను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ లుమాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సహకారం అందించాలన్నారు. ప్రజల సమస్యలు వెంట నే పరిష్కరించి గ్రామంలో సమస్యలు లే కుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ శ్రీనివాస్, ఆర్‌ఐ రాజు తది తరులు పాల్గొన్నారు.