13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఫీజు బకాయిలను విడుదల చేయాలి

30-01-2026 12:35 AM
  1. లేని పక్షంలో రాష్ట్రంలో యుద్ధమే
  2. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు,  ఎంపీ ఆర్.కృష్ణయ్య 

ముషీరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): స్కాలర్షిప్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఫీజుల కోసం ట్రస్ట్ బ్యాంకుల వద్ద తిరగకుండా చూడాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు,  ఎంపీ ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు గురువారం లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట  విద్యార్థులతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ  విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చాలగాటం ఆడుతుందని అయన మండిపడ్డారు.  రాష్ట్రంలో 119 బీసీ గురుకులాలు 100 బీసీ కాలేజ్ హాస్టళ్లను మంజూ రు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ కాలేజ్ హాస్టళ్లలో సీట్లు అందుబాటులో లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో రాత్రులు గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యా ర్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్దె త్తున ఆం దోళన కార్యక్రమాన్ని చెప్పాడుతామని  ఎంపీ కృష్ణయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు నీల వెంకటేష్ ముదిరాజ్, జి. అనంతయ్య, పగిల్ల సతీష్, రాందేవ్ మోదీ, నిమ్మల వీరన్న, తదితరులు పాల్గొన్నారు.