14 July, 2026 | 6:30 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

ఫీజు బకాయిలను విడుదల చేయాలి

30-01-2026 12:35 AM
  1. లేని పక్షంలో రాష్ట్రంలో యుద్ధమే
  2. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు,  ఎంపీ ఆర్.కృష్ణయ్య 

ముషీరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): స్కాలర్షిప్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఫీజుల కోసం ట్రస్ట్ బ్యాంకుల వద్ద తిరగకుండా చూడాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు,  ఎంపీ ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు గురువారం లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట  విద్యార్థులతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ  విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చాలగాటం ఆడుతుందని అయన మండిపడ్డారు.  రాష్ట్రంలో 119 బీసీ గురుకులాలు 100 బీసీ కాలేజ్ హాస్టళ్లను మంజూ రు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ కాలేజ్ హాస్టళ్లలో సీట్లు అందుబాటులో లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో రాత్రులు గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యా ర్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్దె త్తున ఆం దోళన కార్యక్రమాన్ని చెప్పాడుతామని  ఎంపీ కృష్ణయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు నీల వెంకటేష్ ముదిరాజ్, జి. అనంతయ్య, పగిల్ల సతీష్, రాందేవ్ మోదీ, నిమ్మల వీరన్న, తదితరులు పాల్గొన్నారు.