10 May, 2026 | 9:10 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

సివంగుల జోరు.. బంగ్లా బేజారు

27-01-2025 12:00 AM
  1. 64కే బంగ్లా ఖేల్ ఖతం 
  2. ఆడుతూ పాడుతూ లక్ష్య ఛేదన

కౌలాలంపూర్: అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత అమ్మాయిలు తమ జోరును కొనసాగిస్తున్నారు. ఆదివారం బంగ్లాదేశ్ అమ్మాయిలతో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. ఈ విజయంతో భారత్ సెమీఫైనల్ బెర్తుకు మరింత చేరువయింది.

టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న భారత అమ్మాయిలు బంగ్లాదేశ్ ముప్పుతిప్పలు పెట్టారు. భారత బౌలర్ల ధాటికి బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 64 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్ల దెబ్బకు ఏకంగా ఏడుగురు బంగ్లా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు.

వైష్ణవి శర్మ మూడు వికెట్లతో సత్తా చాటింది. 65 పరుగుల స్ప ల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ ఆడు తూ పాడుతూ 7.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యం చేధించింది. మూడు వికెట్లతో బంగ్లా నడ్డి విరిచిన వైష్ణవికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.