17-01-2026 02:02:15 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, జనవరి 16 :మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక పనులలో అధికారుల నిమగ్నమైనందువల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్ కార్యా లయంతో పాటు నాలుగు మున్సిపల్ ఏరియాలో వాయిదా వేసినట్టు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల స న్నాహక పనులు ముఖ్యమైన కార్యకలాపాలలో జిల్లా స్థాయి అధికారులు నిమగ్నమై ఉన్న నేపథ్యం లో, ఈ నెల 19 న నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని మెదక్ జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంతో పాటు నాలుగు మున్సిపాలిటీ ఏరియాలలో ప్రజావాణి తాత్కాలికంగా వా యిదా వేస్తున్నట్లు వెల్లడించారు. మిగతా మండలాలలో తాసిల్దార్ కార్యాలయాల్లో యధావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని కలెక్టర్ వెల్లడించారు.