7 April, 2026 | 11:42 AM

Breaking News

అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన.. జూనియర్ లాయర్ హత్య   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •   రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం... తగలబడిన బట్టల షాపు   •   కూల్ బీరు అడిగిండని కాళీ సీసతో వ్యక్తిపై దాడి.!   •  

వర్షాలు పడాలి.. పంటలు పండాలి

28-07-2025 12:35 AM

- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ 

- ఎల్బీనగర్ నియోజకవర్గంలో బోనాల ఉత్సవాలు 

ఎల్బీనగర్, జులై 27 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఆదివారం వాడవాడలా బోనాల ఉత్సవాలు ఘనంగా జ రిగాయి. అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తిశ్రద్ధలతో భక్తులు, మహిళలు, ప్రజాప్రతిని ధు లు, రాజకీయ పార్టీల నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీలోని ఎల్లమ్మ ఆలయంలో నిర్వ హించిన బోనాల ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు మొద్దు లచ్చి రెడ్డి, నవజీవన్ రెడ్డి తదితరు లు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నాగోల్ డివిజన్ పరిధిలో జరిగిన బో నాల ఉత్సవాల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్ తదితరులు పాల్గొని, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో వా రు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సుభిక్షంగా కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవార్లను కోరుకున్నారు. ఆయా కార్య క్రమాల్లో బీజేపీ నాయకులు శ్రీధర్ రావు, విష్ణువర్ధన్ రెడ్డి, సురేష్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.