calender_icon.png 14 August, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయాలి

13-08-2025 12:21:12 AM

కలెక్టర్ అభిలాష అభినవ్ 

నిర్మల్, ఆగస్టు ౧౨ (విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తులన్నింటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావే శంలో ఆమె మాట్లాడుతూ, రేపు (బుధవా రం) జిల్లాలో రాష్ట్ర సమాచార కమిషన్ బృందం పర్యటన నేపథ్యంలో శాఖల వారీ గా ఇప్పటివరకు నమోదైన దరఖాస్తులు, వాటి పరిష్కారం, పెండింగ్ కేసులు తదితర అంశాలను అధికారులు పరిశీలించాలన్నా రు.

అన్ని శాఖల్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (PIO) తప్పనిసరిగా ఉండాలని, 4(1) బి రిజిస్టర్ను పకడ్బందీగా నిర్వహించాలని సూచిం చారు. రేపు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం దరఖాస్తులపై కమిషన్ బృందం విచారణ చేపడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.