17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

రోడ్డు ప్యాచ్ పనులు పూర్తి చేయాలి

29-01-2026 12:00 AM

గాంధీనగర్ కార్పొరేటర్ ఏ పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): వివి గిరి నగర్ బస్తీలో రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు వెంటనే పూర్తి చేయాలని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గాంధీనగర్ డివిజన్ లోని వివి గిరి నగర్ బస్తీలో ఇటీవల పూర్తున నూతన మంచినీటి, సివరేజి పైప్ లైన్ పనుల అనంతరం రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు పూర్తి కాలేదన్న సమస్యను గిరి నగర్ బస్తీ వాసులు కార్పొరేటర్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు బుధవారం కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ జలమండలి అధికారులు డీజీఎం కార్తీక్ రెడ్డి, మేనేజర్ కృష్ణ మోహన్, సిబ్బంది, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ తో కలసి బస్తీలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాయి కుమార్, సాయికిరణ్ యాదవ్, విజయ లక్ష్మి, బస్తీ వాసులు నర్సింగ్‌రావు, సి. సాయి కుమార్, హన్మంత్ రావు పాల్గొన్నారు.