15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

29-01-2026 12:02 AM

నల్లగొండ టౌన్ , జనవరి 28: నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో పక్కన ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం పరిశీలించారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు అనుసరిస్తున్న విధానం, ప్రవేశనిష్క్రమణ మార్గాలు, క్యూలైన్లు, పోలీస్ బందొబస్త్, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. అభ్యర్థులు, వారి ప్రతినిధులు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.

నామినేషన్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాల్సిందేనని, అనుమతి లేకుండా గుంపులుగా చేరడం, నినాదాలు చేయడం, జెండాలు, బ్యానర్లు ప్రదర్శించడం, ర్యాలీలకు అవకాశం లేదని స్పష్టం చేశారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలుగా పటిష్టమైన పోలీస్ బందొబస్త్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ధ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా, ప్రత్యేక గస్తీ బృందాల ఏర్పాటు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అవసరమైనప్పుడు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులపై కఠినంగా వ్యవహరించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రతిని ధులు పోలీస్ శాఖకు సహకరించాలని, ఎన్నికల నియమాలను గౌరవించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివరాం రెడ్డి,ఎస్.బి సీఐ రాము, 2 టౌన్ ఎస్‌ఐ సైదులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.