15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

క్యూర్, ప్యూర్, రేర్ స్ఫూర్తిని ప్రదర్శించాలి

10-01-2026 01:40 AM
  1. తెలంగాణ రైజింగ్- 2047 వ్యూహం అమలు చేయాలి
  2. దావోస్ పర్యటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం

హైదరాబాద్, జనవరి ౯ (విజయక్రాంతి): వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డ బ్లూఈఎఫ్) దావోస్- 2026లో తెలంగాణ రైజింగ్- 2047 వ్యూహంతో ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆ అంతర్జాతీయ వేదికలో తమ ప్రభుత్వ పాలసీ క్యూర్, ప్యూర్, రేర్ స్ఫూర్తిని ప్రదర్శించాలని దిశానిర్దేశం చేశారు. ఈ నెల 19 నుంచి 23 వరకు డావోస్ వేదికగా డబ్ల్యూఎఫ్ స్టాల్స్ జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో అందు కు సంబంధించిన యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు.

3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనే లక్ష్యం గా ప్రణాళికలు, వ్యూహాలు అమలు చేయాల్సి ఉందన్నారు. తెలంగాణ రైజిం గ్ విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరిచిన మూడు దశల ఆర్థిక వృద్ధి వ్యూహం తో పెట్టుబడులను ఆకర్షించాలని సూ చించారు. గతంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల పురోగతిని సమీక్షించి, అ డ్డంకులను గుర్తించాలని, తర్వాత వాటి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.