24 June, 2026 | 2:35 PM

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా వినిపించే ఒకే మాట.. 'కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ కావాలి'   •   'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •  

మహిళల అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ ధ్యేయం

26-01-2026 01:09 AM

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

హనుమకొండ టౌన్, జనవరి 25 (విజయక్రాంతి): రాష్ట్రంలోని మహిళల అభ్యు న్నతే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివా రం హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం ద్వారా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

అ నంతరం మాట్లాడుతూ మహిళలు ఆర్థిక ప్ర గతి సాధిస్తే కుటుంబాలతో పాటు రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలకు ప్రాధాన్యమిస్తూ 200 మంది మైనార్టీ మహిళ లబ్ధిదారులకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మైనార్టీ అనుబంధ సం ఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.