21 April, 2026 | 4:19 PM

Breaking News

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •   భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   మంత్రి ఉత్తమ్ కేసీఆర్ కోవర్ట్: ఎంపీ అర్వింద్   •   ఘనంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం   •   ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడదాం   •   జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు: మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   33% మహిళా రిజర్వేషన్ లో సామాజిక న్యాయం పాటించాలి   •   అభిమాని కుమారుడు కేశఖండనానికి వెళ్లిన ఎమ్మెల్యే   •   జీవన్ రెడ్డి.. పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. వెయ్యి ఏండ్లయినా BRS పార్టీ మారదు   •   విద్యార్థులకు మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారం అందించండి   •  

రష్యా యుద్ధం ముగియనుంది!

19-08-2025 12:25 AM
  1. కాల్పుల విరమణ కాదు.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసమే ప్రయత్నం
  2. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
  3. ఉక్రెయిన్ అధ్యక్షుడితో భేటీ
  4. త్రైపాక్షిక సమావేశమే మార్గం 

వాషింగ్టన్, ఆగస్టు 18: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనా ల్డ్ ట్రంప్ సోమవారం అమెరికాలోని వాషింగ్టన్‌లో భేటీ అయ్యారు. సమావేశం ముగి సిన అనంతరం మీడియా సమావేశంలో ఇరు దేశాల అధినేతలు మాట్లాడారు. ‘కాల్పుల విరమణ కాదు. యుద్ధం ముగింపు కోసమే మా ప్రయత్నం. శాంతి కోసం ఉక్రెయిన్‌తో కలిసి పని చేస్తాం. దీర్ఘకాలిక శాంతి కోసం ప్రయత్నాలు చేస్తాం. యుద్ధంతో ప్రపంచం అలసిపోయింది.

యుద్ధం ముగించేందుకు త్రైపాక్షిక సమావేశమే మార్గం’ అని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ‘మూడున్నర సంవత్సరాల యుద్ధాన్ని ముగించేలా ప్రయత్నాలు చేస్తున్నందుకు ట్రంప్‌కు ధన్యవా దాలు. ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ ప్రజలు ఎంతో బాధపడ్డారు’ అని పేర్కొన్నారు. ఫిబ్రవరి సమావేశంలో ట్రంప్-జెలెన్‌స్కీ నడు మ గొడవ జరగ్గా.. ఈ సమావేశం మాత్రం ప్రశాంతంగా ముగిసింది.